10 శాతం రిజర్వేషన్‌ మోసపూరితం

ABN , First Publish Date - 2022-09-23T09:23:52+05:30 IST

10 శాతం రిజర్వేషన్‌ మోసపూరితం

10 శాతం రిజర్వేషన్‌ మోసపూరితం

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ 


చౌటుప్పల్‌ రూరల్‌, సెప్టెంబరు 22: సీఎం కేసీఆర్‌ ఎస్టీలను మోసం చేయడానికే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్‌, గిరిజన బంధు పథకాలను ప్రకటించారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆరోపించారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండల పరిధిలోని తూప్రాన్‌పేట, దండుమల్కాపురం, ఖైతాపురం, పీపల్‌పహాడ్‌, అల్లాపురం, దేవలమ్మనాగారం గ్రామాల్లో బహుజన రాజ్యాధికార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలు ప్రవీణ్‌ కుమార్‌కు ఘనస్వాగతం పలికారు. ఆయా గ్రామాల్లో ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. మునుగోడు ఉప ఎన్నిక కోసం కేసీఆర్‌కు గిరిజనులపై ప్రేమ పుట్టిందన్నారు. గత ఎన్నికల్లో కేసీఆర్‌కు గిరిజనులు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. కేసీఆర్‌కు గిరిజనులపై గౌరవం ఉంటే గిరిజన మహిళను రాష్ట్రపతిగా నిలబెడితే ఎందుకు మద్దతు ప్రకటించలేదని ప్రశ్నించారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో యువకులను తాగుబోతులను చేస్తున్నారని దుయ్యబట్టారు. 

Updated Date - 2022-09-23T09:23:52+05:30 IST