గద్వాల డీఎంహెచ్వోకు లంచం ఇచ్చా
ABN , First Publish Date - 2022-09-23T08:42:41+05:30 IST
గద్వాల డీఎంహెచ్వోకు లంచం ఇచ్చా
నా కూతురి పోస్టింగ్ కోసం లక్ష డిమాండ్
వినియోగదారుల ఫోరం చైర్మన్ తిమ్మప్ప
గద్వాల క్రైం, సెప్టెంబరు 22 : తన కూతురి పోస్టింగ్ కోసం గద్వాల డీఎంహెచ్వో చందూ నాయక్కు రూ.లక్ష లంచం ఇచ్చానని రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ తిమ్మప్ప ఓ టీవీ చానల్లో చేసిన వ్యాఖ్యలు గురువారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇందుకు సంబంధించి ఆయనను ఆంధ్రజ్యోతి సంప్రదించగా పలు వివరాలను వెల్లడించారు. గద్వాల డీఎంహెచ్వో చందూనాయక్ పోస్టింగ్ల పేరుతో రూ.4 లక్షల నుంచి రూ.5లక్షల దాకా లంచం తీసుకుంటున్నారని తిమ్మప్ప ఆరోపించారు. ఈ ఏడాది జూన్లో తన కూతురు ఆయుర్వేద డాక్టర్ పోస్టింగ్ కోసం తనను లంచం డిమాండ్ చేశారని చెప్పారు. తాను రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ అని తెలిసి కూడా డబ్బులు అడిగారని, దీంతో తన బంధువు ద్వారా రూ.లక్ష ఇచ్చానని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని చెప్పారు. కాగా, గట్టు తిమ్మప్ప చేసిన ఆరోపణలో వాస్తవం లేదని, ఆయనెవరో తనకు తెలియదని డీఎంహెచ్వో చందూనాయక్ తెలిపారు. జూన్లో లంచం ఇచ్చి ఉంటే ఇప్పుడు ఎందుకు విషయం బయటకు తెస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.