మల్లన్న సాగర్‌తో సర్వం కోల్పోయాం: బాధితులు

ABN , First Publish Date - 2022-09-23T08:41:27+05:30 IST

మల్లన్న సాగర్‌తో సర్వం కోల్పోయాం: బాధితులు

మల్లన్న సాగర్‌తో సర్వం కోల్పోయాం: బాధితులు

హైదరాబాద్‌, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్‌ వల్ల తాము సర్వస్వం కోల్పోయామని మంత్రి టీ.హరీశ్‌రావుతో ముంపు బాధితులు మొర పెట్టుకున్నారు. మల్లన్నసాగర్‌ ముంపు గ్రామమైన ఎర్రవెల్లికి చెందిన పలువురు గ్రామస్థులు మంత్రికి తమ సమస్యలను విన్నవించుకొని వినతిపత్రం అందజేశారు.  గ్రామస్థుల సమస్యలు విన్న మంత్రి.. వెంటనే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారని బాధితులు తెలిపారు. ఎర్రవెల్లితో పాటు ఇతర ముంపు గ్రామాల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని సూచించారన్నారు. 

Updated Date - 2022-09-23T08:41:27+05:30 IST