అక్టోబరు 17న ఆర్ఎంసీ సమావేశం
ABN , First Publish Date - 2022-09-23T08:44:45+05:30 IST
అక్టోబరు 17న ఆర్ఎంసీ సమావేశం
శ్రీశైలం, సాగర్లలో జలవిద్యుత్, రూల్కర్వ్, వరద జలాల గుర్తింపుపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవడానికి వీలుగా అక్టోబరు 17న రిజర్వాయర్ మేనేజ్మెంట్ కమిటీ (ఆర్ఎంసీ) సమావేశం నిర్వహించాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు(కేఆర్ఎంబీ) నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ సమావేశం ఐదుసార్లు వాయిదా పడింది. 17న జరగనున్న సమావేశానికి అయినా వీలు చూసుకొని హాజరుకావాలని, వాయిదా వేయమని మళ్లీ కోరరాదని బోర్డు విజ్ఙప్తి చేయడం గమనార్హం. ఈ మేరకు తెలుగు రాష్ట్రాలకు బోర్డు ఎస్ఈ అశోక్కుమార్ గురువారం లేఖ రాశారు.