ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహార అంశంపై హైకోర్టులో విచారణ

ABN , First Publish Date - 2022-02-10T22:18:59+05:30 IST

రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహార అంశంపై హైకోర్టులో

ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహార అంశంపై హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహార అంశంపై హైకోర్టులో విచారణ జరిగింది. సిద్దిపేటకు చెందిన సామాజిక కార్యకర్త కొండల్‌రెడ్డి పిల్‌పై హైకోర్టు విచారించింది. రైతు కుటుంబాలకు పరిహారం చెల్లింపులో జాప్యంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏప్రిల్ 6న రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. రూ.6 లక్షలు చెల్లించేలా 2015లో ప్రభుత్వం జీవో ఇచ్చిందని కోర్టుకు పిటిషనర్ తెలిపారు. జీవో జారీ చేసి ఆరేళ్లు దాటినా పరిహారం చెల్లించలేదని పిటిషనర్ వాదించారు. గడువు కావాలన్న ప్రభుత్వ న్యాయవాది అభ్యర్థనపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణను ఏప్రిల్ 6కు వాయిదా వేసింది. 


Updated Date - 2022-02-10T22:18:59+05:30 IST