బీజేపీ నాయకుల భరతం పడతాం: చీఫ్ విప్ దాస్యం

ABN , First Publish Date - 2021-11-11T22:16:37+05:30 IST

రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాయకుల భరతం పడతామని

బీజేపీ నాయకుల భరతం పడతాం: చీఫ్ విప్ దాస్యం

హనుమకొండ: రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాయకుల భరతం పడతామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ హెచ్చరించారు. సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని, ప్రజాక్షేత్రం నుంచి ఉరికిస్తామని బీజేపీ నాయకులను వినయ్ భాస్కర్ హెచ్చరించారు. కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించే రైతుల ధర్నాపై వినయ్ బాస్కర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులను చావుదెబ్బ కొట్టేలా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. రైతులకు అండగా నిలిచేందుకే శుక్రవారం నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు పార్టీ పిలుపునిచ్చిందన్నారు. హనుమకొండ చౌరస్తా నుంచి ఏకశిల పార్క్ వరకు శుక్రవారం ర్యాలీ నిర్వహించి ధర్నా చేస్తామన్నారు. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు. రైతులను మోసం చేస్తున్న బీజేపీ నాయకుల భరతం పడతామన్నారు. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నాయకులు ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. 

Updated Date - 2021-11-11T22:16:37+05:30 IST