వడ్లు కొనడం ప్రభుత్వం బాధ్యత: షర్మిల

ABN , First Publish Date - 2021-12-26T00:55:34+05:30 IST

వరి ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత్రి షర్మిల స్పష్టం చేశారు. శనివారం ఆమె మీడియాతో మద్దతు ధర ఉన్న

వడ్లు కొనడం ప్రభుత్వం బాధ్యత: షర్మిల

హైదరాబాద్‌: వరి ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని వైఎస్‌ఆర్‌సీపీ అధినేత్రి షర్మిల స్పష్టం చేశారు. శనివారం ఆమె మీడియాతో మద్దతు ధర ఉన్న వరి పండించడం రైతుల హక్కని, వడ్లు కొనడం ప్రభుత్వం బాధ్యత అని చెప్పారు. ‘‘కొన్న వడ్లని బాయిల్డ్ చేసుకుంటారా.. విదేశాలకు ఎగుమతి చేస్తారా.. ఫామ్‌హౌస్‌లో పోస్తారా.. ఢిల్లీలో పారబోస్తరా అనేది మీ పనితనం. రాష్ట్రంలో చేతకాని సీఎం, మంత్రులున్నారు. వడ్లు కొనడం చేతకాక ఉద్దెర ముచ్చట్లు మాట్లాడుతున్నారు. వడ్లు కొనాల్సిందే. రైతును ఆదుకోవాల్సిందే. వరి వద్దన్న సీఎం మాకొద్దు’’ అని షర్మిల ప్రకటించారు.

Updated Date - 2021-12-26T00:55:34+05:30 IST