ఈవీఎంల భద్రత కోసం గోదాములు: శశాంక్ గోయల్

ABN , First Publish Date - 2021-12-17T23:17:25+05:30 IST

ఈవీఎం, వీవీ ప్యాట్‌ల భద్రత కోసం నూతనంగా ఏర్పడిన జిల్లాలో

ఈవీఎంల భద్రత కోసం గోదాములు: శశాంక్ గోయల్

 మెదక్: ఈవీఎం, వీవీ ప్యాట్‌ల భద్రత కోసం నూతనంగా ఏర్పడిన జిల్లాలో గోదాములు నిర్మిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల అధికారి  శశాంక్ గోయల్ తెలిపారు. పట్టణంలోని నూతన సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ఈవీఎం, వీవీ ప్యాట్‌ల గోదామును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ గోదాముల వద్ద 24 గంటల సెక్యూరిటీ ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికి  రెండు లక్షల మంది నుంచి ఓటు హక్కు కోసం దరఖాస్తులు వచ్చాయన్నారు. 2022 జనవరి, 5 నాటికి తుది జాబితా విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో  కలెక్టర్ హరీష్, అదనపు కలెక్టర్లు రమేష్, ప్రతిమా సింగ్, అధికారులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-17T23:17:25+05:30 IST