ఈనెల 14న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: శశాంక్‌ గోయల్

ABN , First Publish Date - 2021-12-11T00:42:29+05:30 IST

రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని

ఈనెల 14న ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు: శశాంక్‌ గోయల్

హైదరాబాద్: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని సీఈవో శశాంక్‌ గోయల్ తెలిపారు. ఈనెల 14న ఉ.8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. అభ్యర్థుల పర్యవేక్షణలో స్ట్రాంగ్‌రూమ్‌లు సీజ్ చేస్తున్నామన్నారు. స్ట్రాంగ్‌రూంల దగ్గర సీసీ కెమెరాలు, పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు. కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా కౌంటింగ్‌ జరుగుతుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినవారు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు. 




Updated Date - 2021-12-11T00:42:29+05:30 IST