దళిత సర్పంచ్పై రాళ్లతో దాడి
ABN , First Publish Date - 2020-09-15T08:26:23+05:30 IST
దళిత సర్పంచ్పై రాళ్లతో దాడి
వర్ధన్నపేట, సెప్టెంబరు 14 : భూ పంచాయితీ తీర్మానం విషయంలో మాట్లాడడానికి వెళ్లిన దళిత సర్పంచ్పై కొందరు రాళ్లతో దాడి చేసి, తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం కడారిగూడెంలో జరిగింది. బాధితుడి కథనం ప్రకారం... గ్రామంలో సోమవారం భూ పంచాయితీ విషయంలో ఇరు వర్గాలు సర్పంచ్ సతీష్ సమక్షంలో తీర్మానం రాస్తున్నారు. అయితే, తమకు న్యాయం జరగలేదంటూ కోటేశ్వర్, అతని కుటుంబ సభ్యులు కులం పేరుతో దూషిస్తూ సతీ్షపై రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయన పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడానికి వెళ్లగా ఎస్ఐ అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేయించారు. దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలంటూ ఎమ్మార్పీఎస్, దళిత సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు.