మహాత్ముడికి నివాళుల అనంతరం విజిటర్స్ బుక్లో ట్రంప్ ఏం రాశారంటే...
ABN , First Publish Date - 2020-02-25T17:35:24+05:30 IST
రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా రాజ్ఘాట్లోని...
న్యూఢిల్లీ: రెండో రోజు పర్యటనలో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా రాజ్ఘాట్లోని మహాత్మ గాంధీ స్మారక స్థలాన్ని సందర్శించారు. బాపూ సమాధి వద్ద పుష్పగుచ్చం సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజిటర్స్ బుక్లో ట్రంప్ ఓ సందేశాన్ని రాశారు. మహాత్ముడి ఆకాంక్షల మేరకు నిర్మితమైన సార్వభౌమ, అద్భుతమైన భారత్కు అమెరికా ప్రజలు అండగా ఉంటారని, ఇది తనకు దక్కిన అరుదైన గౌరవమని ట్రంప్ విజిటర్స్ బుక్లో రాశారు.