రూ.926కే ట్రూజెట్‌ విమాన టికెట్‌

ABN , First Publish Date - 2021-01-23T06:09:46+05:30 IST

రూ.926కే ట్రూజెట్‌ విమాన టికెట్‌

రూ.926కే ట్రూజెట్‌ విమాన టికెట్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): రిపబ్లిక్‌ దినోత్సవాన్ని పురస్కరించుకుని రూ.926 ధరకే విమాన టికెట్లను ఆఫర్‌ చేస్తున్నట్లు ప్రాంతీయ విమానయాన సంస్థ ట్రూజెట్‌ ప్రకటించింది. ట్రూ రిపబ్లిక్‌ డే టికెట్‌ విక్రయాలు 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఆఫర్‌లో భాగంగా టికెట్లను కొనుగోలు చేసిన ప్రయాణికులు ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి అక్టోబరు 30వ తేదీల మధ్య ప్రయాణం చేయవచ్చని వెల్లడించింది. రూ.926 టికెట్‌ ధరకు పన్నులు అదనమని ట్రూజెట్‌ తెలిపింది. 

Updated Date - 2021-01-23T06:09:46+05:30 IST