ఓటు నమోదుపై పట్టభద్రులను చైతన్య పరచాలి: ఎండీ షఫి

ABN , First Publish Date - 2020-10-05T22:29:06+05:30 IST

పట్టభద్రులు విధిగా ఓటు నమోదు చేసుకోవాలని టీఆర్ఎస్‌వీ ఎల్బీ నగర్ అధ్యక్షుడు ఎండీ షఫీ కోరారు. టీఆర్ఎస్‌వీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

ఓటు నమోదుపై పట్టభద్రులను చైతన్య పరచాలి: ఎండీ షఫి

ఎల్బీ నగర్: పట్టభద్రులు విధిగా ఓటు నమోదు చేసుకోవాలని టీఆర్ఎస్‌వీ ఎల్బీ నగర్ అధ్యక్షుడు ఎండీ షఫీ కోరారు. టీఆర్ఎస్‌వీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఓటు నమోదుపై ఇంటింటికి తిరిగి పట్టభద్రులను చైతన్యపరచాలన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జి. పాండు గౌడ్ విచ్చేశారు. ఈ నెల 11న మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిర్వహించే కార్యక్రమానికి నేతలంతా హాజరకావాలని పాండు కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎన్ రాజు, అనిల్, లోకేశ్, జైపాల్, అభిలాష్, సునీల్, రాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-05T22:29:06+05:30 IST