తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం
ABN , First Publish Date - 2021-08-24T22:39:01+05:30 IST
నగరంలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం
హైదరాబాద్: నగరంలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సమావేశం జరగుతోంది. సమావేశానికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, 67 మంది కమిటీ సభ్యులు హాజరయ్యారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, పార్టీ శాఖల పునర్నిర్మాణంపై చర్చ జరుగుతోంది. పార్టీ శాఖల నిర్మాణానికి తేదీలను అధిష్టానం ఖరారు చేయనుంది. దళితబంధు అమలు విషయంలో పార్టీ శ్రేణులు అనుసరించాల్సిన పద్ధతి, ప్రజలకు ఎలా చెప్పాలనే దానిపై కేసీఆర్ వివరించనున్నారు. జిల్లా పార్టీ ఆఫీస్ల ప్రారంభోత్సవాలపై సమావేశంలో చర్చ జరుగనుంది.