TS News: టీఆర్ఎస్ను గెలిపిస్తేనే నిధులిస్తారట: ఈటల
ABN , First Publish Date - 2022-08-19T01:50:19+05:30 IST
Nalgonda: కేసీఆర్ సర్కార్పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Rajender) తీవ్ర విమర్శలు చేశారు. హుజురాబాద్లో ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా గెలవలేకపోయామని
Nalgonda: కేసీఆర్ సర్కార్పై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (MLA Rajender) తీవ్ర విమర్శలు చేశారు. హుజురాబాద్లో ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా గెలవలేకపోయామని గుర్తించిన టీఆర్ఎస్ ముఖ్య నాయకులు.. ప్రస్తుతం మునుగోడులో టీఆర్ఎస్ను గెలిపిస్తేనే నిధులిస్తామని ప్రజలను బెదిరిస్తున్నారని పేర్కొన్నారు. కేసీఆర్ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని, ఇంకా పాలనపై ఆయనకు నమ్మకం ఉంటే ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు దిగాలని సవాల్ విసిరారు. పార్టీలో చేరికలపై ఈటల మాట్లాడారు. సీఎం కేసీఆర్ (CM KCR), ఆయన పాలనా విధానం నచ్చకే కొంతమంది ప్రజాప్రతినిధులు బీజేపీ(BJP)లో చేరుతున్నారని తెలిపారు.