టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2021-05-14T05:30:00+05:30 IST

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కేశ్‌పల్లి గడ్డం ఆనంద్‌రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గుండెపోటు రావడంతో వెంట నే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆనంద్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు.

టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు  కేశ్‌పల్లి ఆనంద్‌రెడ్డి గుండెపోటుతో మృతి

జక్రాన్‌పల్లి, మే14: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు కేశ్‌పల్లి గడ్డం ఆనంద్‌రెడ్డి శుక్రవారం గుండెపోటుతో మృతి చెందారు. ఆయన గుండెపోటు రావడంతో వెంట నే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆనంద్‌రెడ్డిని హైదరాబాద్‌కు తరలించారు. చికిత్స పొందుతూ కిమ్స్‌ ఆసుపత్రిలో ఆనంద్‌రెడ్డి మృతి చెందారు. ఆయన మృతితో తన స్వగ్రామమైన కేశ్‌పల్లి గ్రామంలో విషా దం నింపింది. మాజీఎంపీ, ఎమ్మెల్సీ కవిత సమక్షంలో ఆనంద్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి అ భివృద్ధి పనులు చేస్తూ సేవ కార్యక్రమాలను చేపడుతున్నారు. కేశ్‌పల్లి గ్రా మాన్ని దత్తాత తీసుకుని అభివృద్ధి చేశారు. శుక్రవారం సాయంత్రం డిచ్‌పల్లి మండలం మెంట్రాజ్‌పల్లిలోని ఫాంహౌజ్‌లో అంత్యక్రియలు నిర్వహించారు.   

Updated Date - 2021-05-14T05:30:00+05:30 IST