కరోనాతో టీఆర్ఎస్ సీనియర్ నేత కన్నుమూత
ABN , First Publish Date - 2021-05-14T18:22:11+05:30 IST
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కరోనాతో మృతి చెందారు...
హైదరాబాద్/ముషీరాబాద్ : టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెస్లీ కరోనాతో మృతి చెందారు. ఆయన అనారోగ్యంతో బాధపడుతూ గత సోమవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చింది. చికిత్స నిమిత్తం ఉప్పల్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స పొందుతూ బుధవారం అర్ధరాత్రి మృతి చెందారు. ఆయనకు భార్య, కొడుకు కుమార్తె ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబుయాదవ్, తదితరులు వారి కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వెస్లీ అంత్యక్రియలు గురువారం అల్వాల్లోని శ్మశాన వాటికలో నిర్వహించారు.