Praja Sangram Yatra: బండి సంజయ్ పాదయాత్రలో అడుగడుగునా హైటెన్షన్
ABN , First Publish Date - 2022-08-15T22:37:38+05:30 IST
బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్రలో అడుగడుగునా హైటెన్షన్ నెలకొంది. రూట్ మ్యాప్ మధ్యలో మైలారం దగ్గర టీఆర్ఎస్
జనగామ: బీజేపీ నేత బండి సంజయ్ పాదయాత్రలో అడుగడుగునా హైటెన్షన్ నెలకొంది. రూట్ మ్యాప్ మధ్యలో మైలారం దగ్గర టీఆర్ఎస్ (TRS) కార్యకర్తలు భారీగా మోహరించారు. బండి సంజయ్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. సంజయ్కి స్వాగతం పలికేందుకు బీజేపీ (BJP) కార్యకర్తలు కూడా వచ్చారు. పోటాపోటీ నినాదాలతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అక్కడి పరిస్థితిని వరంగల్ సీపీ తరుణ్ జోషీ పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని దేవరుప్పుల మండల కేంద్రం నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ (Bandi sanjay) ప్రజా సంగ్రామ యాత్ర (Praja Sangram Yatra) సోమవారం ఉదయం ప్రారంభమైంది. సంజయ్కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మండల కేంద్రంలోని ప్రశాంతి హైస్కూల్లో జాతీయ జెండాను బండి సంజయ్ ఎగుర వేశారు. ఇవాళ బొడతండా, దేవరుప్పుల తండా, ధర్మపురం, మైలారం,గ్రామాల మీదుగా యాత్ర కొనసాగనుంది. సాయంత్రానికి బండి సంజయ్ విస్నూర్ గ్రామానికి చేరుకొని దుర్గమ్మ తల్లిని దర్శించుకుని రాత్రికి ఇక్కడే బస చేయనున్నారు.