28న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

ABN , First Publish Date - 2021-11-28T02:01:47+05:30 IST

త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో

28న టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ

హైదరాబాద్‌: త్వరలో పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ ఈ నెల 28న ఆదివారం జరుగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రం విధానాలపై ప్రధాన చర్చిస్తారు. కొత్త విద్యుత్ చట్టం, విభజన హామీలు, నీటి వాటాల అంశాలపై పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.  




Updated Date - 2021-11-28T02:01:47+05:30 IST