టీఆర్‌ఎస్‌లో ముసలం

ABN , First Publish Date - 2022-04-09T21:47:48+05:30 IST

ములుగు జిల్లా టీఆర్‌ఎస్‌లో ముసలం రాజుకుంది. తాడ్వాయిలో జెడ్పీటీసీలు, మండల అధ్యక్షుల రహస్య భేటీ జరిగింది.

టీఆర్‌ఎస్‌లో ముసలం

ములుగు: ములుగు జిల్లా టీఆర్‌ఎస్‌లో ముసలం రాజుకుంది. తాడ్వాయిలో జెడ్పీటీసీలు, మండల అధ్యక్షుల రహస్య భేటీ జరిగింది. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో సొంత పార్టీ కార్యకర్తలను.. పక్కన పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలను ఎంపిక చేశారని ఆవేదన చేశారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి సత్యవతి రాథోడ్ వైఖరిపై జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు మండిపడ్డారు.వారి పదువులకు, పార్టీకి సామూహికంగా రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రి సత్యవతి రాథోడ్ వైఖరిపై పార్టీ అధిష్ఠానానికి  జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు లేఖ రాశారు. మంత్రి సత్యవతి రాథోడ్ అభివృద్ధికి నిధులు కూడా సరిగా ఇవ్వడం  లేదని జెడ్పీటీసీలు, మండల అధ్యక్షులు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-04-09T21:47:48+05:30 IST