అలా అయితేనే సంజయ్ ను తిరగనిస్తాం: ఎమ్మెల్సీ పల్లా

ABN , First Publish Date - 2021-11-16T02:39:18+05:30 IST

ధాన్యం సేకరణపై పాలసీ చెప్పితేనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తెలంగాణలో

అలా అయితేనే సంజయ్ ను తిరగనిస్తాం: ఎమ్మెల్సీ పల్లా

హైదరాబాద్: ధాన్యం సేకరణపై పాలసీ చెప్పితేనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను తెలంగాణలో తిరగనిస్తామని టీఆర్‌ఎస్  ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.  బండి సంజయ్‌ను తెలంగాణ రైతుల తరపున  వెంటాడతాం, వేటాడుతమని ఆయన పేర్కొన్నారు. నల్గొండ రైతులపై దాడులు చేసిన వారిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ 100 వాహనాల్లో హైదరాబాద్ నుంచి పేరు మోసిన రౌడీలతో నల్గొండ పర్యటనకు వెళ్ళాడని ఆయన ఆరోపించారు.  ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను రెచ్చగొట్టారన్నారు. రైతుల కల్లాలు చూస్తున్నామని చెప్పి, రైతుల రక్తాన్ని బీజేపీ చూసిందన్నారు.


ఏ పాలసీతో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్దకు బండి సంజయ్ వెళ్లారో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్ ధర్నాలు చేస్తూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తర భారత దేశంలో ధాన్యం కొనుగోలు  చేస్తూ.. దక్షిణ భారత దేశంలో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయరని సంజయ్‌ను ఆయన ప్రశ్నించారు. 


Updated Date - 2021-11-16T02:39:18+05:30 IST