మంత్రి రోజా వ్యాఖ్యలపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2022-04-30T01:26:27+05:30 IST

మంత్రి రోజా వ్యాఖ్యలపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

మంత్రి రోజా వ్యాఖ్యలపై స్పందించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే

హైదరాబాద్: ఏపీ మంత్రి రోజాపై పాలేరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి మండిపడ్డారు. ఏపీపై కేటీఆర్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్న ఏపీ మంత్రి రోజా వ్యాఖ్యలపై ఉపేందర్‌రెడ్డి స్పందించారు. రోజా తాను టూరిస్ట్‌ మంత్రి కాదని, టూరిజం మంత్రి అని తెలుసుకోవాలని ఉపేందర్ రెడ్డి సూచించారు. కేటీఆర్‌ వ్యాఖ్యల్లో తప్పులేదని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి అన్నారు. కేటీఆర్‌ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం లేదని ఉపేందర్‌రెడ్డి స్పష్టం చేశారు.


అంతకు ముందు ఏపీ పరిస్థితులపై మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కరెంట్‌, నీటి సౌకర్యం లేదని, రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని శుక్రవారం హైదరాబాద్‌ మాదాపూర్‌ హైటెక్స్‌ సిటీలో జరిగిన క్రెడాయ్‌ ప్రాపర్టీ షోలో మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఈ విషయం ఏపీకి వెళ్లొచ్చిన తన స్నేహితులు చెబుతున్నారన్నారని, ఏపీలో ఉంటే నరకంలో ఉన్నట్లు ఉందని చెప్పారని కేటీఆర్ పేర్కొన్నారు. అనుమానం ఉంటే.. ఎవరైనా ఏపీకి వెళ్లిరండని మంత్రి కేటీఆర్ సలహా ఇచ్చారు. ఏపీతో పోలిస్తే..తెలంగాణలో రోడ్లు, మౌలిక సదుపాయాలు బాగున్నాయని కేటీఆర్ చెప్పారు.

Updated Date - 2022-04-30T01:26:27+05:30 IST