రాష్ట్ర మంత్రిపై హత్యకు కుట్ర చేయడం దారుణం: Jeevan reddy

ABN , First Publish Date - 2022-03-03T16:48:39+05:30 IST

ఒక రాష్ట్ర మంత్రిపై హత్య కుట్ర చేయడం దారుణమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు.

రాష్ట్ర మంత్రిపై హత్యకు కుట్ర చేయడం దారుణం: Jeevan reddy

హైదరాబాద్: ఒక రాష్ట్ర మంత్రిపై హత్య కుట్ర చేయడం దారుణమని టీఆర్ఎస్ ఎమ్మెల్యే, పీయూసీ చైర్మన్ జీవన్ రెడ్డి అన్నారు. కుట్రలోని పాత్ర దారులు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంట్లో ఎలా ఉన్నారని ప్రశ్నించారు. జితేందర్ రెడ్డికి వారికి సంబంధం ఏంటన్నారు. కిడ్నప్‌ల గురించి మాజీ మంత్రి డీకే అరుణకు ముందే ఎలా తెలుసని నిలదీశారు. తమ ప్రభుత్వం ఇలాంటి చర్యలను కుట్రలను ఉపేక్షించదని,  దోషులు ఎంతటి వారు అయిన శిక్ష తప్పదని హెచ్చరించారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి పనులు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. సెక్షన్ 212 ప్రకారం నిందితులకు షెల్టర్ ఇచ్చిన వారూ కూడా దోషులే అని అన్నారు. డీకే అరుణ, జితేందర్ రెడ్డిలపై కేసులు పెట్టాలని డీజీపీ, సీపీలను కోరుతున్నామన్నారు. దోషులకు బీజేపీ షెల్టర్ ఇవ్వడం సిగ్గు చేటని విమర్శించారు. తెలంగాణలో ఇలాంటి పనికి మాలిన రాజకీయాలు నడవవని జీవన్ రెడ్డి అన్నారు. 

Updated Date - 2022-03-03T16:48:39+05:30 IST