కిషన్రెడ్డి తలకాయ ఎక్కడ: ఎమ్మెల్యే జీవన్రెడ్డి
ABN , First Publish Date - 2021-12-03T22:12:19+05:30 IST
ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతల తీరుపై ఎమ్మెల్యే
హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ నేతల తీరుపై ఎమ్మెల్యే జీవన్రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బాయిల్డ్ రైస్ పై కేంద్రం స్పష్టత ఇవ్వడంతో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తలకాయ ఎక్కడ పెట్టుకుంటాడని జీవన్రెడ్డి ప్రశ్నించారు. బాయిల్డ్ రైస్పై రాజ్యసభలో కేంద్రం స్పష్టత ఇచ్చిందన్నారు. బాయిల్డ్ రైస్ను కొనుగోలు చేయబోమని కేంద్రం తేల్చి చెప్పిందన్నారు. కేంద్రం దొంగ నాటకాలు ఆడుతోందని తాము ముందునుంచీ చెబుతూనే ఉన్నామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఇప్పటికైనా రైతులకు క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.