రైతులను అర్వింద్‌ మోసం చేశారు: ఎమ్మెల్యే బాల్క

ABN , First Publish Date - 2021-11-30T21:45:56+05:30 IST

పసుపు బోర్డు విషయంలో రైతులను బీజేపీ ఎంపీ

రైతులను అర్వింద్‌ మోసం చేశారు: ఎమ్మెల్యే బాల్క

హైదరాబాద్: పసుపు బోర్డు విషయంలో రైతులను బీజేపీ ఎంపీ అర్వింద్‌ మోసం చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్, అర్వింద్‌వి దిగజారుడు రాజకీయాలని ఆయన విమర్శించారు. సీఎం కేసీఆర్‌ని విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదన్నారు. సంజయ్, అర్వింద్‌కి రైతులు త్వరలోనే బుద్ధి చెప్తారన్నారు. కేసీఆర్‌పై ఇష్టానుసారం మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. 



Updated Date - 2021-11-30T21:45:56+05:30 IST