కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న టీఆర్ఎస్

ABN , First Publish Date - 2021-03-06T20:57:06+05:30 IST

కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం ఇప్పుడు వరంగల్‌లో రాజకీయ దుమారం రేపుతోంది.

కేంద్రం నిర్ణయంపై భగ్గుమన్న టీఆర్ఎస్

వరంగల్: కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం ఇప్పుడు వరంగల్‌లో రాజకీయ దుమారం రేపుతోంది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకు ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో టీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్నారు. వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్‌లో జరిగిన నిరసన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ బండి సంజయ్, అరవింద్‌కు కోచ్ ఫ్యాక్టరీ తెచ్చే దమ్ముందా? అని సవాల్ చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇస్తామని ఒప్పందంలో ఉందన్నారు. ఇప్పుడు ఇవ్వలేమని కేంద్రం చెప్పిందని.. ఒప్పందాన్ని తుంగలో తొక్కిందని నరేందర్ మండిపడ్డారు.

Updated Date - 2021-03-06T20:57:06+05:30 IST