ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతల కౌంటర్
ABN , First Publish Date - 2022-04-29T21:43:17+05:30 IST
ఏపీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతల కౌంటర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకు టీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. బొత్స కుటుంబం అంతా హైదరాబాద్లోనే ఉంటుందని, కేటీఆర్ ఏపీ గురించి ఉన్న నిజమే మాట్లాడారని మంత్రి వేముల అన్నారు. ఏపీని అభివృద్ధి చేసుకుంటే మేమేమైనా అడ్డుపడుతామా? అంటూ వేముల ప్రశ్నించారు. బొత్స బిల్లు కట్టలేదు కావొచ్చు అందుకే కరెంట్ కట్చేసి ఉంటారని ఎంపీ రంజిత్రెడ్డి అన్నారు. వైసీపీ నేతల కుటుంబీకులు హైదరాబాద్లోనే ఉంటున్నారని, విద్యుత్ విషయంపై వారిని అడిగితే చెబుతారని ఎంపీ రంజిత్రెడ్డి తెలిపారు.