తెలంగాణపై కేంద్రం వివక్ష: వినోద్ కుమార్

ABN , First Publish Date - 2022-01-31T22:52:18+05:30 IST

తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం

తెలంగాణపై కేంద్రం వివక్ష: వినోద్ కుమార్

హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం వివక్ష చూపుతోందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. సాయంత్రం జరిగే కేంద్ర కేబినెట్‌లో కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ పై ప్రధాని నిర్ణయం తీసుకోవాలని, పార్లమెంట్‌లో ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. లేదంటే అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగిస్తామన్నారు. ఏ రాష్ట్రం నుంచి రైల్వే మంత్రులు వస్తే వారికే ప్రాజెక్టులు తరలిపోతున్నాయని ఆయన ఆరోపించారు. గుజరాత్, బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలకు రాష్ట్ర భాగస్వామ్యం లేకుండానే రైల్వే ట్రాక్‌లు, ప్రాజెక్ట్‌లు మంజూరు చేస్తున్నారన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే భూ సేకరణ, నిధులు ఇచ్చిందన్నారు. బీజేపీ నేతలు అబద్ధాలు చెబుతున్నారన్నారు. బడ్జెట్‌లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని ఆయన కోరారు. 

Updated Date - 2022-01-31T22:52:18+05:30 IST