ఉన్మాదులను తయారు చేసిన పార్టీ బీజేపీ: తాతా మధు

ABN , First Publish Date - 2022-04-23T18:39:00+05:30 IST

ఖమ్మం జిల్లా పోరాటాల గడ్డ.. ఇక్కడ మతోన్మాదలకు, గాడ్సే వారసులకు స్థానం లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు.

ఉన్మాదులను తయారు చేసిన పార్టీ బీజేపీ: తాతా మధు

ఖమ్మం: ఖమ్మం జిల్లా పోరాటాల గడ్డ.. ఇక్కడ మతోన్మాదలకు, గాడ్సే వారసులకు స్థానం లేదని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ... గాడ్సే నుంచి బండి సంజయ్ వరకు ఉన్మాదులను తయారు చేసిన పార్టీ బీజేపీ అని విమర్శలు గుప్పించారు. మంత్రి కేటీఆర్‌ను వెధవ అంటున్నారని... బండి సంజయ్ కంటే దరిద్రడు, వెధవ ఎవరూ లేరన్నారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కూడబలుక్కొని ఒకే ఎజెండాతో మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ముదిగొండ కాల్పులు జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క ముదిగొండ అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలన్నారు. సాయి గణేష్ మృతిపై రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఖమ్మంలో చిన్న ఘటన జరిగితే కేసీఆర్, కేటీఆర్, మంత్రి పువ్వాడపై బురద జల్లుతున్నారన్నారు. ‘‘మీరు రెచ్చిపోతే.. మేము రెచ్చిపోతాము’’ అంటూ తాతా మధు స్పష్టం చేశారు. 

Updated Date - 2022-04-23T18:39:00+05:30 IST