TRS కోసం ఎంతో ఖర్చు చేశా.. పార్టీలో గుర్తింపు కరువైంది..!

ABN , First Publish Date - 2021-09-14T14:51:09+05:30 IST

పార్టీలో మొదటి నుంచి జెండా మోయడంతోపాటు పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశాను..

TRS కోసం ఎంతో ఖర్చు చేశా.. పార్టీలో గుర్తింపు కరువైంది..!

హైదరాబాద్ సిటీ/బేగంపేట : ‘పార్టీలో మొదటి నుంచి జెండా మోయడంతోపాటు పార్టీ కోసం ఎంతో ఖర్చు చేశాను... పార్టీలో.. ప్రభుత్వంలో పదవులు ఇవ్వాలని పెద్ద నాయకులను కలిసి విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోయింది’ అంటూ టీఆర్‌ఎస్‌ నేత లక్ష్మణ్‌ ముదిరాజ్‌ ప్రగతి భవన్‌ వద్ద సోమవారం ఆత్మహత్యకు ప్రయత్నించాడు. పోలీసులు అతనిని అరెస్టు చేసి పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. జనగామ జిల్లాకు చెందిన లక్ష్మణ్‌ ముదిరాజ్‌ ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్నారు. పదవులు రాలేదని తీవ్ర నిరాశకు గురైన లక్ష్మణ్‌ ముదిరాజ్‌ సోమవారం ప్రగతిభవన్‌ వద్దకు చేరుకున్నాడు. వెంట తెచ్చుకున్న రెండు బాటిళ్ల డీజిల్‌‌ను ఒంటిపై పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించడంతో, అక్కడ విధుల్లో ఉన్న పోలీసులు అతనిని అదుపులోనికి తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. స్టేషన్‌లో సైతం కొంతసేపు బైఠాయించడంతో అతనికి పోలీసులు కౌన్సెలింగ్‌ ఇవ్వగా, అక్కడ నుంచి వెళ్లి పోయినట్లు పోలీసులు తెలిపారు.



Updated Date - 2021-09-14T14:51:09+05:30 IST