వీర్నపల్లి టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఆత్మహత్యాయత్నం

ABN , First Publish Date - 2020-07-10T20:05:31+05:30 IST

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వీర్నపల్లి టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గోగుల రమేష్ ఆత్మహత్యాయత్నం చేశారు.

వీర్నపల్లి టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు ఆత్మహత్యాయత్నం

రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని వీర్నపల్లి టీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు గోగుల రమేష్ ఆత్మహత్యాయత్నం చేశారు. భూవివాదంలో రమేష్‌పై పోలీసు స్టేషన్‌లో అటవీ శాఖాధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో మనస్తాపానికి గురైన రమేష్.. వీర్నపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. అతన్ని చికిత్స కోసం ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. కంచర్ల గ్రామంలో గత పదిహేనేళ్ల నుంచి రమేష్ పోడు భూమిని సాగు చేస్తున్నాడు.


Updated Date - 2020-07-10T20:05:31+05:30 IST