బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌ నాయకుడు

ABN , First Publish Date - 2022-05-17T05:12:53+05:30 IST

బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌ నాయకుడు

బీజేపీలో చేరిన టీఆర్‌ఎస్‌ నాయకుడు
బండి సంజయ్‌ సమక్షంలో బీజేపీలో చేరుతున్న అశోక్‌

వికారాబాద్‌, మే 16: టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ పట్టణ మాజీ అధ్యక్షుడు అశోక్‌ సోమవారం బీజేపీలో చేరారు. వికారాబాద్‌లో పర్యటించిన బండి సంజయ్‌ సోమవారం మాజీ మంత్రి చంద్రశేఖర్‌ నివాసానికి రావడంతో చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో బండి సంజయ్‌తో పార్టీ కండువా కప్పించుకొని పార్టీలో చేరారు. ఈ సందర్భంగా అశోక్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసే తాను బీజేపీలో చేరినట్లు తెలిపారు. మాజీ మంత్రి చంద్రశేఖర్‌ అడుగుజాడల్లో నడుస్తానని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన వివరించారు.

Updated Date - 2022-05-17T05:12:53+05:30 IST