దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో దళితబంధు ప్రకటించి మాట్లాడాలి: Jeevan reddy

ABN , First Publish Date - 2021-08-17T17:31:44+05:30 IST

టీపీసీసీ చీఫ్ రేవంత్, బీజేపీ నేతలు అరవింద్, బండి సంజయ్‌పై పీయూసీ చైర్మన్ జీవన్ ‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

దమ్ముంటే ఆ రాష్ట్రాల్లో దళితబంధు ప్రకటించి మాట్లాడాలి: Jeevan reddy

హైదరాబాద్: టీపీసీసీ చీఫ్ రేవంత్, బీజేపీ నేతలు అరవింద్, బండి సంజయ్‌పై పీయూసీ చైర్మన్ జీవన్ ‌రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పై విమర్శలు చేసేవాళ్ళు బ్రోకర్- జోకర్- లోఫర్ గాళ్ళు మాత్రమే అని అన్నారు. బ్రోకర్ రేవంత్ రెడ్డి, జోకర్ అరవింద్, లోఫర్ బండి సంజయ్ అనవసర రాద్దాంతం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. దళితబంధుపై ప్రతిపక్షాలు ఊరకుక్కలాగ అరుస్తున్నారని అన్నారు. బీజేపీ-కాంగ్రేస్ పాలిత రాష్ట్రాల్లో దమ్ముంటే దళితబంధు ప్రకటించి మాట్లాడాలి సవాల్ విసిరారు. బండి సంజయ్- రేవంత్‌కు దమ్ముంటే రాబోయే రోజుల్లో దళితబంధు ఇస్తామని మోడీ- రాహుల్ గాంధీతో ప్రకటన చేయించాలన్నారు. రాబోయే రోజుల్లో గాంధీ భవన్‌కు టులెట్ బోర్డు పెట్టాల్సి వస్తుందని భయపడుతున్నారని జీవన్ ‌రెడ్డ యెద్దేవా చేశారు. 

Updated Date - 2021-08-17T17:31:44+05:30 IST