పాదయాత్రలతో రాష్ట్రాన్ని, కేసీఆర్‌ను అపవిత్రం చేయాలని యత్నం: Gutta

ABN , First Publish Date - 2021-10-23T15:06:45+05:30 IST

పాదయాత్రల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని, సీఎం కేసీఆర్‌ను అపవిత్రం చేయాలని చూస్తున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శ

పాదయాత్రలతో రాష్ట్రాన్ని, కేసీఆర్‌ను అపవిత్రం చేయాలని యత్నం: Gutta

నల్లగొండ: పాదయాత్రల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని, సీఎం కేసీఆర్‌ను అపవిత్రం చేయాలని చూస్తున్నారని శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి పథంలో ముందున్న రాష్ట్రంలో ఉన్న వనరులు, వసతులను దోచుకోవాలని కపట వేశాలతో రేవంత్ రెడ్డి, బండి సంజయ్, వైఎస్ షర్మిలలు ముందుకు వస్తున్నారని విమర్శించారు. ఏపీలో అవకాశం లేక హైదరాబాద్, తెలంగాణపై పెత్తనం చేయాలని వైఎస్ షర్మిల చూస్తున్నారని మండిపడ్డారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి గెలుపును ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. చరిత్రలో లేని విధంగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపుపై బీజేపీకి ఆలోచన లేదని...ప్రజలను ఓటును అడిగే హక్కు బీజేపీకి లేదని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2021-10-23T15:06:45+05:30 IST