బీజేపీ నేతలు వీలైతే సహకరించండి...అంతే గానీ: Gutta

ABN , First Publish Date - 2022-04-15T15:28:38+05:30 IST

సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిలా రైతులు నష్టపోవద్దనే ఈరోజు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభింపజేశారని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

బీజేపీ నేతలు వీలైతే సహకరించండి...అంతే గానీ: Gutta

నల్గొండ: సీఎం కేసీఆర్ రైతు బాంధవుడిలా రైతులు నష్టపోవద్దనే ఈరోజు నుంచే ధాన్యం కొనుగోళ్లు ప్రారంభింపజేశారని  శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ నాయకులు వీలైతే రాష్ట్రానికి సహాకరించాలే తప్ప  విమర్శలు చేయడం సరికాదన్నారు. కేంద్రం మొండి వైఖరి వల్ల రైతులకు నష్టం జరగకుండా సీఎం కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా రైతులకు ఇబ్బందులు జరగకుండా సరిహద్దుల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2022-04-15T15:28:38+05:30 IST