కరోనాతో టీఆర్ఎస్ నాయకుడి మృతి
ABN , First Publish Date - 2021-05-07T06:29:02+05:30 IST
కరోనాతో టీఆర్ఎస్ నాయకుడు మృతి చెందారు.
యూసు్ఫగూడ, మే 6 (ఆంధ్రజ్యోతి): కరోనాతో టీఆర్ఎస్ నాయకుడు మృతి చెందారు. యూసు్ఫగూడ బస్తీకి చెందిన మేడికొండ మల్లికార్జున్(49) నాగర్జున్సాగర్ ఉప ఎన్నిక, మునిసిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంగా ఉండడంతో పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. మూడు రోజులు ఐసొలేషన్లో ఉన్న తర్వాత గాంధీ ఆస్పత్రిలో చేరారు. రెండు రోజుల నుంచి వెంటిలేటర్పై చికిత్స పొందారు. పరిస్థితి విషమించడంతో గురువారం మృతి చెందారు. మల్లికార్జున్కు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన బీజేవైఎంలో పలు స్థాయిల్లో పనిచేశారు. బీజేపీ నగర అధికార ప్రతినిధిగా పనిచేశారు. 25 ఏళ్లు బీజేపీలో పనిచేసిన ఆయన టీఆర్ఎ్సలో ఇటీవల చేరారు. మల్లికార్జున్ మృతికి టీఆర్ఎస్ నాయకుడు రావుల శ్రీధర్రెడ్డి, బీజేపీ నాయకుడు కుంబాల గంగరాజు తదితరులు సంతాపం తెలిపారు.