సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దు: Balka suman

ABN , First Publish Date - 2022-02-07T18:32:57+05:30 IST

సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం చేయొద్దని టీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు.

సింగరేణి సంస్థను ప్రైవేట్ పరం చేయొద్దు: Balka suman

హైదరాబాద్: సింగరేణి సంస్థను ప్రైవేట్‌పరం చేయొద్దని టీఆర్ఎస్ నేత బాల్కసుమన్ అన్నారు. దీనిపై టీఆర్ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు. కార్మికులు ఆందోళన చేస్తున్నా 4 బొగ్గు బ్లాకుల వేలాన్ని అపకపోవడం దారుణమని మండిపడ్డారు. సీఎం లేఖ రాసినా, కార్మికులు ధర్నాలు, దీక్షలు చేసినా కేంద్రం వైఖరి మారడం లేదన్నారు. కేంద్రం తీరు మరకపోతే గల్లీ నుంచి ఢిల్లీ వరకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని... జరిగే పరిణామాలకు బీజేపీదే బాధ్యత అని హెచ్చరించారు. సింగరేణిలో పనిచేసేది బడుగు, బలహీన వర్గాలని, వారిని రోడ్డున పడేసే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మీద కక్ష కట్టి దెబ్బకొట్టే కుట్ర చేస్తోందని బాల్కసుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-02-07T18:32:57+05:30 IST