సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శం: Balka suman
ABN , First Publish Date - 2022-01-12T19:46:34+05:30 IST
ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు.
మంచిర్యాల: ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. దేశంలో రైతు సంక్షేమం కోసం నిరంతరం పరితపిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమేనని అని తెలిపారు. బుధవారం జిల్లాలోని చెన్నూరులో బాల్క సుమన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతు బంధు సంబురాలను నిర్వహించారు. వందలాది ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టారు. కోటపల్లి, చెన్నూరు, భీమారం, జైపూర్, మందమర్రి మండలాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. చెన్నూరు నుంచి గద్దె రాగడి వరకు 40 కిలోమీటర్ల మేర ర్యాలీ కొనసాగింది. భారీ వర్షంలోనూ ర్యాలీని కొనసాగించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ దండె విఠల్, జిల్లా గ్రంథాలయ పరిషత్ చైర్మన్ ప్రవీణ్, మాజీ విప్ నల్లాల ఓదెలు ర్యాలీలో పాల్గొన్నారు.