దేశంలో 70 లక్షల మంది కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2021-03-06T05:30:00+05:30 IST

దేశంలో 70 లక్షల మంది కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీగా టీఆర్‌ఎస్‌ రికార్డు సృష్టించిందని నిర్మల్‌, ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీ, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌ అన్నారు.

దేశంలో 70 లక్షల మంది కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌

కార్యకర్తల బలం టీఆర్‌ఎస్‌ సొంతం : ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌

ఖానాపూర్‌, మార్చి 6 : దేశంలో 70 లక్షల మంది కార్యకర్తలు కలిగిన ఏకైక పార్టీగా టీఆర్‌ఎస్‌ రికార్డు సృష్టించిందని నిర్మల్‌, ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు ఇన్‌చార్జీ, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్‌ అన్నారు. శనివారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు ఆన్‌లైన్‌ ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏ జాతీయ పార్టీకి లేనంతమంది కార్యకర్తల బలం టీఆర్‌ఎస్‌ పార్టీ సొంతమన్నారు.  ఈ కార్యక్రమంలో మార్కెట్‌కమిటి చైర్మన్‌ కడార్ల గంగనర్సయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అబ్దుల్‌ ఖలీల్‌, ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు తాళ్ళపెల్లి రాజగంగన్న, పట్టణాధ్యక్షులు పరిమి సురేష్‌, యూత్‌ మండలాధ్యక్షులు కోడిమ్యాల వీరేష్‌, జిల్లా నాయకులు బక్కశెట్టి కిషోర్‌, కొక్కుల ప్రదీప్‌, బండారి కిషోర్‌, గుగ్గిళ్ళ సతీష్‌, ఎనగందుల నారాయణ, మోయిన్‌, గజేందర్‌, తదితరులున్నారు. 

Updated Date - 2021-03-06T05:30:00+05:30 IST