టీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాల వారికి న్యాయం

ABN , First Publish Date - 2022-08-18T05:45:02+05:30 IST

ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరుతుందని ముధో ల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు.

టీఆర్‌ఎస్‌తోనే అన్నివర్గాల వారికి న్యాయం
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి

కుంటాల, ఆగస్టు 17 : ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీతోనే అన్ని వర్గాల వారికి న్యాయం చేకూరుతుందని ముధో ల్‌ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో పది లక్షల ఆసరా ఫించన్‌లను ఇస్తామని ప్రకటించిన సీఎం చంద్రశేఖర్‌రావు వెంటనే మంజూరు చేసి పేదల పక్షపాతిగా మరోమారు మాట నిలుపుకున్నారని ఆయన పేర్కొ న్నారు. బుధవారం ఆయన మండలంలోని అంబకటి గ్రామానికి 41, తాండాకు 7 నూతన ఆసరా ఫించన్‌లు మంజూరు కాగా ఆయన పంపిణీ చేశారు. సందర్భంగా మాట్లాడుతూ రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రభు త్వం మరింత అభివృద్ధి చెందాలంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుతోనే సాధ్యం అన్నారు. గత కొద్ది రోజుల నుండి నూతన ఫించన్‌ల కోసం ఎదురు చూస్తున్న వారికి ఫించన్లు మంజూరు కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆప్క గజ్జారాంయాదవ్‌, జెడ్పీటీసీ గంగామణి, తహసీల్దార్‌ కలీం, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, ఆత్మచైర్మన్‌ అశోక్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల కన్వీనర్‌ పడకంటి దత్తాత్రి, నాయకులు బుచ్చన్న తదితరులున్నారు.

Updated Date - 2022-08-18T05:45:02+05:30 IST