టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది

ABN , First Publish Date - 2022-07-02T04:43:29+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజావ్యతి రేక విధానాలను అవలంభిస్తోందని మణిపూర్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి శారదాదేవి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సంపర్క్‌ అభి యాన్‌ కార్యక్ర మంలో ఆమె మాట్లాడారు. ఈనెల 3న హైదరాబాద్‌లో జరిగే సంకల్ప సభను విజయ వంతం చేయాలన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రజావ్యతిరేక విధానాలను అవలంభిస్తోంది
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీమతి శారద దేవి

-మణిపూర్‌ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శారదాదేవి

కాగజ్‌నగర్‌, జూలై 1: టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజావ్యతి రేక విధానాలను అవలంభిస్తోందని మణిపూర్‌ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి శారదాదేవి అన్నారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు చేసిన సంపర్క్‌ అభి యాన్‌ కార్యక్ర మంలో ఆమె మాట్లాడారు. ఈనెల 3న హైదరాబాద్‌లో జరిగే సంకల్ప సభను విజయ వంతం చేయాలన్నారు. బీజేపీ లక్ష్యం సబ్‌కా సాత్‌, సబ్‌కా వికాస్‌, సబ్‌కా విశ్వాస్‌ అన్నారు. తెలంగాణలో రానున్న ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రావటం ఖాయ మన్నారు. అనంతరం పలు సూచనలు సలహాలను పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాస్‌, డాక్టర్‌ హరీష్‌బాబు, సిర్పూరు ఇన్‌చార్జీ రాజ మౌళి, జిల్లా ప్రధానకార్యదర్శి కొంగ సత్యనారాయణ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T04:43:29+05:30 IST