17న టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల సమావేశం

ABN , First Publish Date - 2021-12-15T23:16:43+05:30 IST

టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు,

17న టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధుల సమావేశం

హైదరాబాద్: టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతల సమావేశం ఈ నెల 17న జరుగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో సమావేశం జరుగతుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలలో 12 స్థానాలను టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది. అలాగే పార్టీ నిర్మాణానికి తీసుకోవాలసిన చర్యలను సీఎం వివరించే అవకాశం ఉంది. 



Updated Date - 2021-12-15T23:16:43+05:30 IST