టీఆర్ఎస్ ప్రభుత్వానికి మానవత్వం లేదు: షర్మిల
ABN , First Publish Date - 2022-04-14T21:14:44+05:30 IST
టీఆర్ఎస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ
భద్రాద్రి: టీఆర్ఎస్ ప్రభుత్వానికి మానవత్వం లేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల అన్నారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ తీరు ఓడ దాటిన తర్వాత బోడి మల్లన్నలా ఉందని మండపడ్డారు. బ్రతుకు దెరువుగా ఉన్న భూమిని లాక్కునే హక్కు కేసీఆర్కు ఎక్కడిది? అని ప్రశ్నించారు. పోడు భూములకు పట్టాలిస్తానన్న మాట కేసీఆర్ నిలబెట్టుకోవాలన్నారు. తెలంగాణను మరో ఆఫ్ఘనిస్తాన్లా మార్చారని దుయ్యబట్టారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయం ఒక శాపంగా మారిందని షర్మిల మండిపడ్డారు.