భద్రాచలం సొసైటీలో టీఆర్ఎ్సకు షాక్
ABN , First Publish Date - 2020-02-20T10:11:19+05:30 IST
రాష్ట్రంలోనే అతిచిన్న సహకార సంఘంగా గుర్తింపు పొందిన భద్రాచలం సొసైటీలో టీఆర్ఎ్సకు షాక్ తగిలింది. మిత్రపక్షాల సహకారంతో సొసైటీ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. 2014లో సైతం భద్రాచలం సొసైటీని టీడీపీనే గెలుచుకుంది.
- చైర్మన్ పదవిని రెండోసారి దక్కించుకున్న టీడీపీ
భద్రాచలం: రాష్ట్రంలోనే అతిచిన్న సహకార సంఘంగా గుర్తింపు పొందిన భద్రాచలం సొసైటీలో టీఆర్ఎ్సకు షాక్ తగిలింది. మిత్రపక్షాల సహకారంతో సొసైటీ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకుంది. 2014లో సైతం భద్రాచలం సొసైటీని టీడీపీనే గెలుచుకుంది. భద్రాచలం సొసైటీలో 13 స్థానాలకు ఒక స్థానం ఎస్టీ జనరల్, మరో స్థానం ఎస్సీ మహిళకు పోటీ చేసే వారు లేకపోవడంతో మిగతా 11 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. 16న కోరం లేదన్న కారణంతో ఎన్నిక వాయిదా వేశారు. మళ్లీ బుధవారం ఎన్నికలు నిర్వహించారు. మిత్రపక్షాల సహకారంతో టీడీపీ అభ్యర్థి అబ్బినేని శ్రీనివాసరావు చైర్మన్గా, కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మనాపల్లి సత్యనారాయణ వైస్చైర్మన్గా ఎన్నికయ్యారు.