హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే: ఎన్నారై టీఆర్ఎస్

ABN , First Publish Date - 2021-08-01T01:22:44+05:30 IST

హుజురాబాద్‌లో త్వరలో జరగనున్న ఎన్నికల్లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనేనంటూ ఎన్నారై టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది.

హుజురాబాద్‌లో ఎగిరేది గులాబీ జెండానే: ఎన్నారై టీఆర్ఎస్

ఎన్నారై డెస్క్: హుజురాబాద్‌లో త్వరలో జరగనున్న ఉపఎన్నికలో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనేనంటూ ఎన్నారై టీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేసింది. ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచాలం, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి.. లండన్ కార్యవర్గ సభ్యులతో కలిసి హుజురాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ రాబోయే ఉపఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ఎన్నో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తుచేస్తూ నేడు ఈ కార్యక్రమాలన్నీ ప్రపంచాన్ని ఆకర్షిస్తోంటే.. ప్రతిపక్షాలు మాత్రం వారి రాజకీయ లబ్దికోసం పనికిమాలిన, నీతిమాలిన విమర్శలు చేస్తున్నాయని అనిల్ కూర్మాచలం మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వం ఉంటేనే రైతు బంధు, దళిత బంధు లాంటి కార్యక్రమాలు మరెన్నో వస్తాయని, లేని యెడల ప్రతిపక్షాలకు అవకాశమిస్తే అన్నీ బంద్ అవుతాయని ప్రజలకు వివరించారు. 


మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ను కేసీఆర్ తన సొంత తమ్ముడిలా భావించి ఆయనను రాజకీయంగా ప్రోత్సహించి ఎన్నో అవకాశాలు కలిపించారని తెలిపారు. కానీ ఈటెల మాత్రం తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా పార్టీని, ప్రభుత్వాన్ని విమర్శించి, ఆయన చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి, స్వప్రయోజనాలకోసం బీజేపీలో చేరి తల్లిలాంటి టీఆర్ఎస్ పార్టీ నాశనం కావాలని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. వీటన్నింటిని ప్రజలు గమిస్తున్నారని, తప్పకుండా రాబోయే ఉపఎన్నికల్లో తగిన బుద్ది చెప్తారని అనిల్ కూర్మాచలం తెలిపారు. ఈటెల రాజేందర్ ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న సమయంలో కరోనా విషయంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనప్పుడు బీజేపీని వ్యతిరేకించిన ఈటెల అదే పార్టీలో ఎందుకు చేరినారో ప్రజలందరూ ఆలోచించాలని అనిల్ కూర్మాచలం విజ్ఞప్తి చేశారు. ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నారై టీఆర్ఎస్ యూకే ప్రత్యేక కార్యాచరణతో టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించడానికి క్షేత్రస్థాయిలో కృషిచేస్తుందని తెలిపారు. 


ఈ సమావేశానికి ఎన్నారై టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, ఎన్నారై టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, కార్యదర్శులు సత్యమూర్తి చిలుముల, సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, రాజ్ కుమార్ శానబోయిన, విక్రమ్ కుమార్, తిరుమందాస్ నరేష్, రఘువరన్, హుజురాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి రియాజ్, హుజురాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందే సాయిచరణ్, హుజురాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ సెక్రటరీ మధుకర్ రెడ్డి, హుజురాబాద్ సోషల్ మీడియా ఇంచార్జ్ గాలి రాకేష్, టిఆర్ఎస్ నాయకులు ఫయాజ్, బాబా లవన్ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-01T01:22:44+05:30 IST