టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలకు ఇన్చార్జిల నియామకం
ABN , First Publish Date - 2021-09-16T05:20:22+05:30 IST
టీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికలకు ఇన్చార్జిల నియామకం
హనుమకొండ టౌన్, సెప్టెంబరు 15: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంస్థాగత ఎన్నికల ఇన్చార్జిలను టీఆర్ఎస్ నియమించింది. బుధవారం హనుమకొండలోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ ఇన్చార్జి గ్యాదరి బాలమల్లుతో కలిసి మంత్రి ఎర్రబెల్లి పార్టీ ముఖ్యలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇన్చార్జిలను ప్రకటించారు. ఇన్చార్జిలు నియోజకవర్గ పరిధిలోని మండల పార్టీ అధ్యక్షులు, అనుబంధ కమిటీల నియామకాలు ఐదు రోజుల్లో పూర్తి చేయాలని సూచించారు. త్వరలో 5 నియోజకవర్గాలకు కూడా ఇన్చార్జిలను నియమిస్తామని పేర్కొన్నారు.
ఇన్చార్జిలు వీరే..
భూపాలపల్లి - కె.వాసుదేవరెడ్డి, ఎం.డి. అజీజ్ఖాన్, పరకాల - ఎం.సుధీర్కుమార్, కర్మిళ్ల బాబురావు, పాలకుర్తి - జన్ను జఖార్య, గుడి వంశీధర్రెడ్డి, స్టేషన్ఘన్పూర్ - బొల్లం సంపత్కుమార్, సాంబారి సమ్మారావు, వర్ధన్నపేట - మర్రి యాదవరెడ్డి, వరంగల్ తూర్పు - సేవెళ్ల సంపత్, వరంగల్ పశ్చిమ - ఎల్లావుల లలితాయాదవ్