ఆదిలాబాద్ లో దారుణం.. ఓ వ్యక్తిపై టీఆర్ఎస్ కౌన్సిలర్ దాడి

ABN , First Publish Date - 2020-06-05T03:40:57+05:30 IST

ఆదిలాబాద్ లో దారుణం.. ఓ వ్యక్తిపై టీఆర్ఎస్ కౌన్సిలర్ దాడి

ఆదిలాబాద్ లో దారుణం.. ఓ వ్యక్తిపై టీఆర్ఎస్ కౌన్సిలర్ దాడి

ఆదిలాబాద్: జిల్లా కేంద్రంలోని సిలువేరులో దారుణం చోటు చేసుకుంది. సిలువేరులో శ్రీనివాస్ అనే వ్యక్తిపై అనుచరులతో కలిసి టీఆర్ఎస్ కౌన్సిలర్ ఉష్కం రఘుపతి దాడి చేశారు. తనపై దాడికి పాల్పడిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ దాడి ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదు మేరకు పోలీసులు కౌన్సిలర్ తోపాటు 9 మందిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని బాధితుడికి పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Updated Date - 2020-06-05T03:40:57+05:30 IST