మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

ABN , First Publish Date - 2022-01-05T00:39:21+05:30 IST

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై సొంత పార్టీ కౌన్సిలర్ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ గౌడ్‌తో తనకు ప్రాణహాని ఉందని మహబూబ్‌నగర్ 43వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి ఫిర్యాదులో..

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు

హైదరాబాద్: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై సొంత పార్టీ కౌన్సిలర్ హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ గౌడ్‌తో తనకు ప్రాణహాని ఉందని మహబూబ్‌నగర్ 43వ వార్డు కౌన్సిలర్ సుధాకర్ రెడ్డి ఫిర్యాదులో వివరించారు. మహబూబ్‌నగర్‌లో అక్రమ కట్టడాలపై మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశానని, ఆ కక్ష తీర్చుకునేందుకే మంత్రి శ్రీనివాస్ తనను హత్య చేయించాలని చూస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నారు. 



Updated Date - 2022-01-05T00:39:21+05:30 IST