ఆరోగ్య శ్రీ పథకానికి టీఆర్ఎస్ తూట్లు పొడిచింది: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-03-06T22:58:13+05:30 IST

ఆరోగ్య శ్రీ పథకానికి టీఆర్ఎస్ తూట్లు పొడిచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సొంత

ఆరోగ్య శ్రీ పథకానికి టీఆర్ఎస్ తూట్లు పొడిచింది: కిషన్‌రెడ్డి

వరంగల్: ఆరోగ్య శ్రీ పథకానికి టీఆర్ఎస్ తూట్లు పొడిచిందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సొంత ప్రాంతానికి ఇచ్చిన ప్రాధాన్యత ఇతర ప్రాంతాలకు ఇవ్వడం లేదని తప్పుబట్టారు. బీబీనగర్‌లో మెడికల్ కాలేజీ ప్రారంభమైనా ప్రభుత్వం భూములివ్వలేదని, వరంగల్‌లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి.. రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.30కోట్లు చెల్లించలేదని తెలిపారు. రూ.6 వేల కోట్లతో రామగుండంలో ఎరువుల పరిశ్రమ తెచ్చామని, దానిని త్వరలోనే ప్రధాని మోదీ ప్రారంభిస్తారని కిషన్‌రెడ్డి ప్రకటించారు. ఉద్యమకారులు రోడ్లపై ఉంటే ఉద్యమ ద్రోహులు ప్రగతి భవన్‌లో ఉన్నారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.

Updated Date - 2021-03-06T22:58:13+05:30 IST