BJPలో చేరిన టీఆర్ఎస్, కాంగ్రెస్ సర్పంచ్లు
ABN , First Publish Date - 2022-08-17T16:40:23+05:30 IST
జిల్లాలోని చండూర్ మండలంలో గల పలు గ్రామాల టీఆర్ఎస్, కాంగ్రెస్ సర్పంచ్లు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
నల్గొండ: జిల్లాలోని చండూర్ మండలంలో గల పలు గ్రామాల టీఆర్ఎస్ (TRS), కాంగ్రెస్ (Congress) సర్పంచ్లు బీజేపీ (BJP) తీర్థం పుచ్చుకున్నారు. బుధవారం ఉదయం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (Etela rajender) సమక్షంలో పలువురు సర్పంచ్లు, ఎంపీటీసీలు బీజేపీ కండువా కప్పుకున్నారు. చొప్పరి వారి గూడెం, ధోనిపాముల, నెర్మట, తుమ్మలపల్లికి చెందిన టీఆర్ఎస్ సర్పంచ్లు బీజేపీలో చేరారు. అలాగే... ఉడతల పల్లి, కోటయ్య గూడెం, శిర్ధే పల్లి, గొల్లగూడెంకు చెందిన కాంగ్రెస్ సర్పంచులు కమలం పార్టీలో చేరారు. మునుగోడు మండలం చల్మడ టీఆర్ఎస్ గ్రామ సర్పంచ్, కస్తాల, కొండాపురంకు చెందిన కాంగ్రెస్ ఎంపీటీసీలు ఈటెల సమక్షంలో బీజేపీలో చేరారు.